జీవిత సాఫల్య పురస్కారం

ముప్పవరపు ఫౌండేషన్‌, రైతునేస్తం సంయుక్త నిర్వహణలో అందిస్తున్న ”రైతు నేస్తం” పురస్కారాల్లో భాగంగా 2019 సంవత్సరానికి గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా|| జి.వి. రామాంజనేయులు గారికి అందించడం జరిగింది. ముఖ్య అతిధి భారత ఉపరాష్ట్రపతి శ్రీ యం. వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా డా|| జి.వి. రామాంజనేయులు గారు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర గవర్నర్‌ డా|| శ్రీమతి తమిళిసై సౌందర రాజన్‌ విశిష్ట అతిధిగా హాజరయ్యారు. సెప్టెంబర్‌ 22న హైదరాబాద్‌లోని స్వర్ణ భారతి ట్రస్ట్‌లో ఈ పురస్కార కార్యక్రమం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *