విత్తన రంగంలో సి.ఎస్‌.ఎ. కృషి – యాదవ రెడ్డి రీజన్‌ కో-ఆర్డినేటర్‌, సి.ఎస్‌.ఎ.

ఏ రకం వరి పంటకైనా విత్తనం పునాది. విత్తనం పండిరచాలి. నూర్పిడి చేయాలి. సరిjైున పద్ధతిలో శ్రేణికరణ (ప్రాసెసింగ్‌) చేయాలి. తద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. 

మంచి నాణ్యమైన విత్తనం విత్తుకుంటే తక్కువ విత్తనం అవసరం అవుతుంది. త్వరగా మొలక వస్తుంది. అంతా ఒకే విధంగా వుంటుంది. తిరిగి నాటు అవసరం తగ్గుతుంది. త్వరగా ఏపుగా పెరగడం ద్వారా, తెగుళ్ళను, చీడను తట్టుకునే సామర్ధ్యం పెంపొందించుకొంటుంది. కలుపు మొక్కల శాతం తగ్గుతుంది. దిగుబడి 5-20 శాతం వరకు పెరుగుతుంది. 

సుస్థిర వ్యవసాయ కేంద్రం, రైతులకు పైన తెలిపిన విధంగా నాణ్యమైన విత్తనం అందించుటకు విత్తనోత్పత్తి సహకార సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో 7 సహకార సంఘాలు, విత్తనోత్పత్తి దారుల కంపనీ (ప్రొడ్యూసర్‌ కంపనీ)లతో పని చేస్తున్నది. 

తెలంగాణ రాష్ట్రంలో రెండు సహకార సంఘాలు వున్నాయి. అవి ఎనబావి సేంద్రియ రైతుల పరస్పర సహాయక సహకార సంఘం ములుగు వ్యవసాయదారుల పరస్పర సహయక సహకార సంఘం, మెదక్‌ జిల్లా. ఈ రెండు సంఘాలు ప్రభుత్వం నుండి వచ్చిన సబ్సిడీ సహాయంతో మొబైల్‌ మినీ సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను కొనుగోలు చేశాయి. వరిలో బి.పి.టి.`5204, యం.టి.యు-1010, తెల్లహంస, ఆర్‌.పి.బయో 226, ఐ.ఆర్‌`64, కావ్య మొదలగు రకాలను సాగు చేసి మార్కెట్‌ చేస్తున్నాయి. 

సుస్థిర వ్యవసాయ కేంద్రం, సహకార సంఘాలకు (బ్రీడర్‌ సీడ్‌) మూల విత్తనం సమకూర్చడం, మార్కెటింగ్‌ లైసెన్స్‌ అందించడంలో సహయం చేస్తున్నది. విత్తనోత్పత్తిలో అవసరమైన సాంకేతిక పరమైన విషయాలను శిక్షణద్వారా అందిస్తూ పర్యవేక్షిస్తున్నది. సహకార సంఘాల నిర్వహణలో అవసరమైన నాయకత్వపు శిక్షణలు సహకార సంఘాల డైరెక్టర్లకు సమకూరుస్తున్నది. 

విత్తన మార్కెటింగ్‌, ప్యాకింగ్‌ మొదలగు విషయాలలో సుస్థిర వ్యవసాయ కేంద్రం నిపుణులు, సహకార సంఘం కోసం పని చేస్తున్నారు. 

ప్రస్తుత సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌కు గాను రెండు సహకార  సంఘాల నుండి వచ్చిన విత్తనం 200 బ్యాగులు మార్కెట్‌ చేశారు. తద్వారా వచ్చిన అనుభవంతో వచ్చే సంవత్సరం 10000 బ్యాగుల (30కిలోల) విత్తనం ఉత్పత్తి చేసి మార్కెట్‌ చేయుటకుగాను ఈ సంఘాలు ప్రణాళిక సిద్దం చేసుకొన్నాయి. 

ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటలో బి.పి.టి-5204, హెచ్‌.యం.టి., యం.టి.యు.-1010, ఐ.ఆర్‌.-64, డబ్ల్యూ.సి.ఐ.-14, కావ్య, సురేఖ, తెల్ల హంస (రకాలను) సాగు చేస్తున్నారు. ఈ రకాలు వచ్చి రబీ మరియు ఖరీఫ్‌ సీజన్స్‌కు అందుబాటులో వుంటాయి. 

  • ఈ కార్యక్రమంలో భాగంగా పత్తి పంటలో రైతులకు 30 కిలోల నాన్‌ బీటీ సూరజ్‌ వెరైటీ ఇవ్వడం జరిగింది. 
  • ముఖ్యమైన పంటలు: పత్తి, సోయ, కందులు (అత్యధిక భాగం వర్షాధారం.)
  • రైతులను వారు వేసే పంటల ఆధారంగా జాయింట్‌ లయబిలిటీ గ్రూపుల ఏర్పాటు. 
  • మొత్తం గ్రూపులు 11 వుంటే అందులో మొత్తం 165 మంది సభ్యులు వున్నారు.
  • ఒక్కొక్క గ్రూపు నందు 15 మంది సభ్యులు వున్నారు.
  • సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడానికి తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు మండలంలో 14 మంది రైతులను సుస్థిర వ్యవసాయం కేంద్రం ఆధ్వర్యంలో ఎంచుకోవడం జరిగింది. 
  • తలమడుగు మండలంలో ఎంచుకున్న గ్రామాలు అనగా ఉమ్రి, రaారి, కపూర్‌దేవి, మండగూడ, కొసాయి, చెర్లపల్లి, దహేగామ, ఈ గ్రామాలలో చేసిన బేస్‌ లైన్‌ సర్వే ఆధారంగా రైతులు చిన్న, సన్నకారు రైతులు.

ముఖ్య ఉద్యేశాలు: 

  • సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం
  • రైతులను సహకార సంఘంగా మార్చడం
  • నాన్‌ బీటీ పత్తి విత్తనం గల ‘సూరజ్‌’ విత్తనాలను పండిరచడం.
  • రైతులకు సేంద్రియ కషాయల గురించి తెలియజేయడం. సహజంగా దొరికే వృక్ష జాతులను వినియోగించుకుని వివిధ రకాల సస్యరక్షణ మందులను తయారు చేయడం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *